రైలు కింద పడి ఉపాధ్యాయుడు మృతి

గద్వాల రైల్వే స్టేషన్ పరిధిలో రైలు కింద పడి ఓ టీచర్ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

Update: 2024-10-17 17:31 GMT

దిశ, గద్వాల క్రైమ్: గద్వాల రైల్వే స్టేషన్ పరిధిలో రైలు కింద పడి ఓ టీచర్ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మృతుడు గద్వాలలోని నల్లకుంటకి చెందిన వీర శేఖర్ టీచర్‌గా రైల్వే పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గద్వాల్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ తెలిపారు. కాగా ఆయనది ఆత్మహత్యనా లేక ప్రమాదవశత్తు ఇలా జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News