శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. మూడు గేట్లు ఎత్తి నీరు విడుదల

Update: 2024-08-28 10:31 GMT

దిశ, అచ్చంపేట : ఎగువన ఉన్న కర్ణాటక రాష్టంలో భారీగా కురుస్తున్న కారణంగా ఎగువన జూరాల ప్రాజెక్టు నుండి వరద జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు లక్షకు పైగా క్యూసెక్కుల వచ్చి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు వరద జలాలను అంచనా వేస్తూ బుధవారం ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగులు పైకి ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు లక్షకు క్యూసెక్కుల పైగా నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు 2.26 లక్షల క్యూసెక్కులు, జూరాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 25, 539 వేల క్యూసెక్కులు, సుంకేసుల ప్రాజెక్టు నుండి 1368 క్యూసెక్కులు మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టుకు 1.60,218 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు మూడు క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగివల నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు 84,087 వేల క్యూసెక్కులు వస్తున్నాయి. తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,882 వేల క్యూసెక్కులు ఏపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30,925 వేల క్యూసెక్కులు మొత్తంగా 1.50 వేల క్యూసెక్కుల వరద నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులు, 215. 807 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 884.90 అడుగులకు చేరుకోగా, 215.3263 టీఎంసీల సామర్థ్యానికి చేరుకుంది. 


Similar News