MLA Yennam: భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రులు ఘనంగా జరపాలి

భక్తి శ్రద్ధలతో దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరపాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-22 10:37 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: భక్తి శ్రద్ధలతో దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరపాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ్ భవన్ లోని దయానంద విద్యా మందిరం లో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉత్సవాల పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఏ ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయ ప్రమేయం, జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే సంప్రదాయాన్ని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

మన పండుగలు వాటి ప్రాముఖ్యత గురించి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం మున్సిపల్ కౌన్సిల్ నుంచి రూ. 3 లక్షల,తన వంతుగా రూ. 50 వేల రూపాయలు అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డాక్టర్.మురళీధర్ రావు, కెఎస్.రవికుమార్, మోహన్ యాదవ్,రామచంద్రయ్య, బురుజు సుధాకర్ రెడ్డి, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, నాగేశ్వర్ రెడ్డి, రామాంజనేయులు, గౌలి వెంకటేష్, వేదవ్రత్, ముత్యం స్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News