విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి...కేసు నమోదు

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ బి. నరేష్ అందించిన వివరాల ప్రకారం…

Update: 2024-09-22 11:59 GMT

దిశ, తెలకపల్లి : విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ బి. నరేష్ అందించిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని కారువంగ గ్రామానికి చెందిన సామ నిరంజన్(55) గ్రామంలోని గుండేటి కుంట దగ్గర ఉన్న తన వ్యవసాయ పొలంలో మిరప తోటకు నీళ్లు పెట్టేందుకు కింద పడిపోయిన విద్యుత్ వైరు తీస్తుండగా ప్రమాదవశాత్తు కుడి చేతికి విద్యుత్ షాకుకు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని భార్య సామ లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. నరేష్ తెలిపారు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Similar News