రైలు ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దుర్మరణం

రైలు ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ తెలిపిన వివరాల ప్రకారం

Update: 2024-09-22 13:55 GMT

దిశ,దేవరకద్ర: రైలు ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ తెలిపిన వివరాల ప్రకారం… దేవరకద్ర సమీపంలో ఉన్న కోటకదిరే గ్రామం దగ్గర (60) సంవత్సరాల వ్యక్తి దేవరకద్ర మండలం డోకూర్ గ్రామ శివారులో (65 )సంవత్సరాల వ్యక్తి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రైలు కింద పడి మృతి చెందారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా మార్చురికి తరలించినట్లు తెలిపారు. మృతుల సమాచారం కోసం ఈ 9441273164 నెంబర్ కు ఫోన్ చేయాలని దేవరకద్ర రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ తెలిపారు.


Similar News