SBI ఇండియా చైర్మన్ గా పెద్దపోతులపాడు వాసి.. గ్రామంలో సంబురాలు

Update: 2024-08-28 16:37 GMT

దిశ, అలంపూర్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలకు చైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకం కవడంతో అతని స్వగ్రామం పెద్దపోతులపాడులో సంబరాలు చేసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా బుధవారం చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్బిఐ బ్యాంక్ సిబ్బంది పెద్దపోతులపాడు గ్రామానికి చేరుకొని సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం.. మానోపాడు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ... వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో మారుమూల గ్రామమైన మానవపాడు మండలం పెద్ద పోతులపాడు గ్రామంలో ఒకటి నుండి ఏడు వరకు చదివి.. ఈరోజు దేశ కీర్తిని పెంచే విధంగా ఎస్బిఐ చైర్మన్ చల్ల శ్రీనివాస్ శెట్టి పొందడం హర్షనీయమన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఇలాంటి గొప్ప వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని చదువుకుని ఉన్నత శిఖరాలను అవరోహించాలని కోరారు. 


Similar News