funds : గాంధీ హై స్కూల్ మరమ్మతులకు నిధులు మంజూరు

పట్టణంలోని జిల్లా పరిషత్ గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఏసీడీపీ నుంచి నిధులను మంజూరు చేశారు.

Update: 2024-10-28 13:09 GMT

దిశ, కొల్లాపూర్: పట్టణంలోని జిల్లా పరిషత్ గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupalli Krishna rao)ఏసీడీపీ నుంచి నిధులను మంజూరు చేశారు. అసంపూర్తిలో ఉన్న వివిధ అభివృద్ధి పనులకు రూ,14 లక్షల 75 వేలలను మంజూరు చేశారు. ఈ నిధులతో పాఠశాలలోని బ్యాలెన్స్ వర్క్, పెయింటింగ్, టాయిలెట్స్ ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాల్ మొదలగు పనులకు నిధులు మంజూరు చేస్తూ.. మంత్రి విడుదల చేశారు. పాఠశాల అభివృద్ది కమిటీ చైర్ పర్సన్ సంధ్యారాణి సోమవారం జిహెచ్ఎం శోభారాణి కి ఇతర ఉపాధ్యాయుల సమక్షంలో నిధులు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రేంజినేని, అల్వాల అర్జున్ గౌడ్, అబిదలి, నరేందర్ రెడ్డి, రామ్మూర్తి, ప్రవీణ్, భాస్కర్, నారాయణ, శ్రీదేవి, సుధాకర్ సింగ్ విద్యార్థులు మంత్రి జూపల్లి కృష్ణారావు కు కృతజ్ఞతలు తెలిపారు.


Similar News