ఆటలతోనే క్రీడాకారుల్లో స్నేహభావం.. దారాసింగ్..

దీపావళి పండుగ సందర్భంగా వీపనగండ్లలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు.

Update: 2024-10-27 07:16 GMT

దిశ, వీపనగండ్ల : దీపావళి పండుగ సందర్భంగా వీపనగండ్లలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. టోర్నీలో 40 జట్లు పాల్గొననున్నట్లు అంబేద్కర్ యూత్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు ధారాసింగ్, బీఆర్ఎస్ మండల నాయకులు ముంత మల్లయ్య యాదవ్, ఎస్సై రాణి మాట్లాడుతూ ఆటల పోటీలతోనే క్రీడాకారుల మధ్య మంచి స్నేహ భావం పెంపొందుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గోదాల బీరయ్య యాదవ్, రైతు కమిటీ అధ్యక్షులు వెంకటరెడ్డి, ముంత శివ యాదవ్ రవీందర్ రెడ్డి, గోపి నాయుడు, పాము నాగులు, మీసాల నాగరాజు,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News