శిశువు మృతిపై డీఎంహెచ్ఓ విచారణ

డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళకు సాధారణ ప్రసవం చేస్తుండగా కడుపులోనే నవజాత శిశువు మరణించడంపై జిల్లా వైద్యాధికారులు విచారణ చేపట్టారు.

Update: 2024-10-08 12:53 GMT

దిశ,గద్వాల క్రైమ్ : డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళకు సాధారణ ప్రసవం చేస్తుండగా కడుపులోనే నవజాత శిశువు మరణించడంపై జిల్లా వైద్యాధికారులు విచారణ చేపట్టారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్ ఎస్కే. సిద్ధప్ప, డాక్టర్ ప్రసూనారాణి (మాత శిశు సంరక్షణ అధికారి) గద్వాల పట్టణంలోని కేపీఎన్ ఆస్పత్రిని సందర్శించి సోమవారం జరిగిన శిశువు మృతిపై ఎంక్వయిరీ చేశారు.

    శిశువు మృతి చెందడానికి గల కారణాలను హాస్పిటల్ యాజమాన్యం వారిని అడిగి తెలుసుకున్నారు. విచారణలో భాగంగా కేపీఎన్ ప్రవేట్ ఆస్పత్రిలో ఓపీ రిజిస్టర్, ఐపీ రిజిస్టర్, కేస్ షీట్ , డిశ్చార్జ్ సమ్మరీ , ల్యాబ్ రిపోర్ట్స్, ఫార్మసీ బిల్స్ వెరిఫై చేశారు. అనంతరం ఎంక్వైరీ రిపోర్టును రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు పంపనున్నట్టు డీఎంహెచ్​ఓ తెలిపారు.  

Tags:    

Similar News