మెరుగైన వైద్యసేవలు అందించాలి

వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు.

Update: 2024-10-08 09:41 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని సిబ్బంది హాజరు పుస్తకాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రికి సమయానికి హాజరై, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వివరాలను పరిశీలించి ఆన్ లైన్ లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.

    ఫార్మసీలో అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రతి మందుపై స్పష్టమైన పేర్లతో లేబుల్స్ ఉండాలని కోరారు. ఫార్మసీ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎక్స్‌రే, ఈసీజీ, డయాలసిస్ యూనిట్లను పరిశీలించారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, టెస్టులు త్వరగా పూర్తి చేసి రిపోర్టులు అందించాలని కోరారు. బ్లడ్ స్టోరేజీ యూనిట్‌ను పరిశీలించి ఎల్లప్పుడూ అవసరమైన రక్తం నిల్వ ఉండేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సరస్వతి, డాక్టర్లు లక్ష్మమ్మ, ఫణీంద్ర, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.  

Tags:    

Similar News