మరీ ఇంత దారుణమా..ఇక్కడ కూరగాయలు, మాంసం కొంటున్నారా..?

పట్టణంలోని తిర్మల్ దేవుని గేటు సమీపంలోని కూరగాయల మార్కెట్ లో కూరగాయలు కొంటే ఆసుపత్రి పాలైనట్టే.

Update: 2024-10-18 16:27 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పట్టణంలోని తిర్మల్ దేవుని గేటు సమీపంలోని కూరగాయల మార్కెట్ లో కూరగాయలు కొంటే ఆసుపత్రి పాలైనట్టే. అలాగే మాంసాహారం కానీ..కూరగాయలు గాని కొంటే అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావాల్సిందేనని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బూనేడ్ బాల్ రాజ్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన మార్కెట్ కు పరిశీలనకు వెళ్ళితే.. మురికి కాల్వ ప్రక్కన చెడు వాసన వస్తున్న మాంసాహారం అమ్మడం, చెడిపోయిన కూరగాయలపై ఈగలు,దోమలతో తీవ్ర దుర్గంధ వాతావరణంలో వ్యాపారం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,కమీషనర్ మహేశ్వర్ రెడ్డి లు స్పందించి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.


Similar News