మత్తులో బిడ్డల్ని చంపేయాలని చూసిన తల్లి.. అడ్డుకున్న యువకుడు

Update: 2024-08-13 03:25 GMT

దిశ, జడ్చర్ల : మద్యం మైకంలో తన నెల రోజుల పసిబిడ్డను గొంతుపిసికి చంపబోయిందీ ఓ మహిళ. జడ్చర్ల రైల్వే ట్రాక్ పక్కనే చోటుచేసుకుంటున్న ఈ దర్ఘటన గుర్తించిన పట్టణ వాసి ముబీన్ తల్లీ, పిల్లను కాపాడి 108 వాహనంలో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన పార్వతి (22)కి ఇద్దరు ఆడపిల్లలు. కాగ పెద్దమ్మాయి అనిత (3), చిన్నమ్మాయి(1నెల రోజులు) ఉంది. భర్త పేరు యాదయ్య. పార్వతి తన భర్తతో కలిసి జడ్చర్ల పట్టణానికి వచ్చి స్థానికంగ ఉన్న ఓ కల్లు దుఖాణంలో పీలక దాక కల్లు తాగింది. తాగిన మత్తులో భర్త కూడా భార్యను పట్టణంలోనే వదిలేసి వెళ్లి పోయాడు. పార్వతి తన ఇద్దరు పిల్లలను తీసుకుని పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుంది. పెద్దమ్మాయి అనితకు బిస్కట్ ప్యాకెట్ ఇచ్చి చేతిలోనే నెల రోజుల పసి కందును గోంతు పిసికి చంపబోయింది.

దీన్ని గుర్తించిన పట్టణ వాసి ముబీన్ అనే వ్యక్తి తల్లి చేతిలో పడి తల్లడిల్లుతున్న పసికందును కసాయి తల్లి బారి నుండి కాపాడడంతో పాటు వెంటనే 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఇద్దరు ప్రాణాలను కాపాడాడు. ఇదే విశయమై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరగా కల్లు తాగిన మత్తులో పిల్లలను చంపి, తాను కూడా రైల్వే ట్రాక్ పై పడి చనిపోయే ప్రయత్నం చేసినట్లు తమతో అన్నట్లు తెలిపారు. 

Tags:    

Similar News