లారీ ఢీకొని 70 గొర్రెలు మృతి

లారీ ఢీకొని 70 గొర్రెలు మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-10-10 15:42 GMT

దిశ,దేవరకద్ర: లారీ ఢీకొని 70 గొర్రెలు మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో చోటు చేసుకుంది. గొర్రెల కాపరులు తెలిపిన వివరాల ప్రకారం..నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ,ముష్టిపల్లి గ్రామానికి చెందిన కురువ వెంకటయ్య ,పోలప్ప అనే రైతులకు చెందిన గొర్రెల మందలను మేపుకొని దేవరకద్ర నుంచి తమగ్రామం ముష్టిపల్లికి వస్తుండగా..వరకద్ర మండలం,పెద్ద గోప్లాపూర్ శివారులో గురువారం రాత్రి మరికల్ వైపు వస్తున్న KA 05AK9383 నెంబర్ గల లారీ గొర్రెల మందపై వెనుక నుంచి వెళ్లడంతో 70 గొర్లు అక్కడికక్కడే నుజ్జు నుజ్జు అయ్యాయి.మరికొన్ని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో గొర్రెల కాపరులు లబోదిబోమని ఏడుస్తున్నారు.సంఘటన స్థలానికి చేరుకున్న దేవరకద్ర ఎస్సై నాగన్న లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Similar News