‘ప్రజావాణి’కి 40 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ.. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు.

Update: 2024-10-21 11:24 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ.. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 40 ఫిర్యాదులు వచ్చాయన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు..అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డిఓ రాంచందర్ లకు అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ..సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News