‘మమ్మల్ని ఎవరూ ఆపలేరు’.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక

సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-10-01 10:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలకు అండగా నిలబడుతూనే ఉంటామని అన్నారు. మమ్మల్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ‘మీ తాటాకు చప్పుళ్ళకి భయపడను. మీ తాట తియ్యడానికి వచ్చాను. నీ పిల్లి కూతలకి భయపడేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఉద్యమాల పిడికిలి ఇది గుర్తు పెట్టుకో. బడుగు బలహీనుల గొంతులను నీ బుల్డోజర్లు తొక్కి పెట్టలేవు. నీ గుండా రాజ్యాన్ని... నియంతృత్వ పాలనను సవాలు చేసే నా స్ఫూర్తిని నీ గుండాలు ఆపలేరు. నీ గుండాలు నా వాహనంపై చేసిన దాడి నాకు మరింత శక్తిని ఇస్తుంది. ఇట్లాంటివి మమ్మల్ని ఆపలేవు’ అని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చారు.


Similar News