కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మంత్రి కొండా సురేఖకు(Konda Surekha) లీగల్ నోటీసులు పంపించారు.

Update: 2024-10-02 16:21 GMT


 

దిశ, వెబ్ డెస్క్ : తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మంత్రి కొండా సురేఖకు(Konda Surekha) లీగల్ నోటీసులు పంపించారు. సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని పేర్కొన్న కేటీఆర్.. తనకు సంబంధం లేని విషయాల్లోకి లాగుతున్నారని మండి పడ్డారు. ఫోన్ ట్యాపింగ్, సినీ పరిశ్రమకు చెందిన వారితో సంబంధాలు అంటగట్టడం వంటి విషయాలు తన గౌరవానికి భంగం కలిగించేవని.. తన హోదాను కూడా మరచిపోయి కొండా సురేఖ అడ్డగోలు అసత్యాలు మాట్లాడారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించకుండా ఉంటే ప్రజలు వాటిని నిజమనుకునే ప్రమాదం ఉందన్నారు. గతంలో కూడా తనపై ఇలాంటి అబద్దపు వ్యాఖ్యలు చేస్తే, ఏప్రిల్ లో లీగల్ నోటీసులు పంపించానని గుర్తు చేశారు. మంత్రి సురేఖ వెంటనే తనకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే.. ఆమె మీద పరువు నష్టం దావాతోపాటు క్రిమినల్ కేసులు కూడా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.  




 



Similar News