‘రాజీనామా చేస్తా’.. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి KTR సంచలన సవాల్

అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సంచలన సవాల్ విసిరారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ

Update: 2024-07-31 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సంచలన సవాల్ విసిరారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ యువత చెబితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ సవాల్ విసిరారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి రిజల్ట్స్ వెల్లడించిన తర్వాత కాంగ్రెస్ వచ్చి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిందన్నారు. కేవలం అపాయింట్‌మెంట్ లెటర్స్ మాత్రమే ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెబుకుంటుందని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాగా, బుధవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాగా.. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధంతో సభ దద్దరిల్లుతోంది. 


Similar News