సుస్థిర ప్రభుత్వానికే దేశ ప్రజలు పట్టం: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కేంద్రంలో మరోసారి సుస్థిర ప్రభుత్వాన్ని దేశ ప్రజలు ఎన్నుకున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

Update: 2024-06-09 16:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో మరోసారి సుస్థిర ప్రభుత్వాన్ని దేశ ప్రజలు ఎన్నుకున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రధాని మోడీ పాలనను అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో మూడోసారి ఏర్పాటైన ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా మరోసారి అవకాశం పొందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను అలాగే హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం ఢిల్లీలో మండలి సభాపక్ష నేత కేవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, పాల్వాయి హరీష్ బాబు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి కలిసి అభినందనలు తెలిపారు.


Similar News