Dog attack :పిచ్చికుక్కల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు

Update: 2024-08-08 14:32 GMT

దిశ, టేకులపల్లి : టేకులపల్లి మండలం సులనగర్ గ్రామపంచాయతీ పరిధిలో పిచ్చికుక్కలు, కోతులు స్తైరవిహారం చేస్తున్నాయి. బుధవారం రాత్రి కాలే వంశీ కుమార్, సూర్యపల్లి వెంకటయ్యపై దాడి చేసితీవ్రంగా గాయపరిచాయి. పిచ్చికుక్కల దాడిలో గ్రామంలో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల వీధి కుక్కలు అనేకసార్లు జంతువులపైన, మనుషుల పైన దాడి చేసిన సంఘటనలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు, స్త్రీలు బయటికి రావాలంటే చేతిలో కర్ర సహాయంతో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు కోతులు మరొకవైపు కుక్కలు దాడులతో హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు వీధి కుక్కల నుండి, కోతులు నివారణకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Tags:    

Similar News