ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలిః ఏఎస్పీ అంకిత్ కుమార్

Update: 2024-08-22 13:20 GMT

దిశ, భద్రాచలంః ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వార్ అన్నారు. గురువారం స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై మధు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఎస్పి అంకిత్ కుమార్ సంక్వార్ మాట్లాడుతూ.. భద్రాచలం పట్టణం పవిత్ర పుణ్యక్షేత్రం రాములవారి దర్శనానికి భక్తులు నిత్యం వస్తుంటారు. భక్తులు పట్ల ఆటో డ్రైవర్లు అంకితభావంతో నడుచుకోవాలి. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించడంతో పాటు ఆటోలకు టాప్ నెంబర్, ప్లేట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, పట్టణంలో ఉన్న ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News