ఏజెన్సీలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న వాగులు..

గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు దుమ్ముగూడెం మండలంలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Update: 2024-07-20 09:09 GMT

దిశ, పర్ణశాల/దుమ్ముగూడెం : గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు దుమ్ముగూడెం మండలంలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీటిని దాటుకొని రాకపోకలు సాగించేందుకు గిరిజనుల అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలకు పెద్ద గుబ్బల మంగి వాగుకు వరద నీరు చేరడంతో మండల పరిధిలోని పెద్ద నల్లబల్లి గ్రామం నుంచి కిష్టారం వెళ్ళే ప్రధాన రహదారి ధరంపేట వద్ద వాగు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంతే కాకుండా చిన్న గుబ్బల మంగి వాగుకు భారీగా వరద నీరు చేరగా వాగులు, వంకలు, అలుగులు పొంగి కే లక్ష్మీపురం, గౌరారం, సున్నం బట్టి పలుప్రధాన రహదారులు నీట మునిగాయి.

Tags:    

Similar News