ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు : కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో ఉరుములు

Update: 2024-10-10 10:54 GMT

దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఇప్పటికే జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.పొలం పనులకు వెళ్లే రైతులు , బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, ఉరుములు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండరాదని , వర్షాలు పడే సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకి, స్తంభాలకి సమీపంలో ఉండకూడదని సూచించారు.ప్రయాణాలు చేసేవారు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కలెక్టర్ తెలిపారు .


Similar News