పోలీసుల ఎదుట లొంగిపోయిన మైనర్ మావోయిస్టు

Update: 2024-08-21 14:12 GMT

దిశ, భద్రాచలంః మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా బెటాలియన్ 01లో పిఎల్ జిఏ క్రియాశీలక సభ్యునిగా కొనసాగుతున్న ముఖేష్ కోర్సా(16) అలియాస్ సూర్యం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఛత్తీస్‌గఢ్, సుకుమా జిల్లా, జాగురుగుండా పోలిస్టేషన్ పరిధిలోని సిల్గర్ గ్రామానికి చెందిన ముఖేష్ అనే మైనర్ బాలుడు 2023 లో మావోయిస్టు ఉద్యమానికి ప్రబావితుడై మావోయిస్టు పార్టీలో చేరాడు. పలు కేసులలో నిందితుడిగా ఉండటమే కాకుండా.. గతములో అనేక ప్రభుత్వ వ్యతిరేక సంఘటనల్లో ప్రత్యక్షంగా పొల్గొన్నట్లు మల్కన్‌గిరి పోలీసులు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ - ఒడిస్సా ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టుల కోసం చేపట్టిన పలు పథకాలకు ఆకర్షితుడై మావోయిస్టుల సిద్దాంతాల నుంచి తిరిగి జనజీవ స్రవంతిలో కలుస్తున్నట్లు ముఖేష్ కోర్స పేర్కొన్నాడు.

Tags:    

Similar News