పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి కానీ, నష్టం జరగని వారికి పరిహారం అందించారని సీపీఎం నాయకులు ఆరోపించారు.

Update: 2024-10-24 13:15 GMT

దిశ, మధిర : తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి కానీ, నష్టం జరగని వారికి పరిహారం అందించారని సీపీఎం నాయకులు ఆరోపించారు. మండల పరిధిలోని ఖమ్మంపాడు రైతు వేదిక ఎదుట సీపీఎం నాయకులు, రైతులు నిరసన వ్యక్తం చేశారు. తప్పుడు రిపోర్టులు పంపించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు వినతి పత్రాన్ని ఏఈఓకి అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి మందా సైదులు, గ్రామ నాయకులు బడిత్య లాలు, అంగడాల అమరయ్య, వైకుంఠపు వెంకటేశ్వరరావు, ములుగు బ్రహ్మచారి, కంచం కృష్ణ, షేక్. సైదులు, దొండపాటి వెంకటరామయ్య, మాజీ ఎంపీటీసీ యేసుమని పాల్గొన్నారు. 

Tags:    

Similar News