దిశ ఎఫెక్ట్.. మానస వికాస్ స్కూల్ ఘటన పై విద్యా కమిషన్ సీరియస్..

కొత్తగూడెంలోని మానస వికాస్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చేతన్ అనే ఆరో తరగతి విద్యార్థి పై అదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న సతీష్ విచక్షణారహితంగా దాడి చేసిన వార్త దిశ పత్రికలో ప్రచురితమైంది.

Update: 2024-10-17 06:29 GMT

దిశ, కొత్తగూడెం : కొత్తగూడెంలోని మానస వికాస్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చేతన్ అనే ఆరో తరగతి విద్యార్థి పై అదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న సతీష్ విచక్షణారహితంగా దాడి చేసిన వార్త దిశ పత్రికలో ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన రాష్ట్ర విద్యా కమిషన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సంబంధిత ఉపాధ్యాయుని పై, పాఠశాల యాజమాన్యం పై శాఖపరమైన చర్యలు చేపట్టాలని గురువారం జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి పాఠశాలల యాజమాన్యాల పై, ఉద్యోగుల పై కఠినంగా వ్యవహరించాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.


Similar News