పాదచారులపైకి దూసుకెళ్లిన కారు.. 8 మందికి గాయాలు..

కల్లూరు మండలం పేరువంచ గ్రామం ఎన్టీఆర్ కాలనీ వద్ద ఓ కారు అతివేగంగా పాదచారులను వెనక నుండి ఢీకొనగా పాదచారులు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు.

Update: 2024-10-17 03:26 GMT

దిశ, కల్లూరు : కల్లూరు మండలం పేరువంచ గ్రామం ఎన్టీఆర్ కాలనీ వద్ద ఓ కారు అతివేగంగా పాదచారులను వెనక నుండి ఢీకొనగా పాదచారులు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. తిరువూరు నుంచి కల్లూరు వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు పేరువంచ ఎన్టీఆర్ కాలనీ నుండి పేరువంచ సెంటర్ వైపు వెళుతున్న 8 మంది పాదచారులను అతివేగంగా వెనుక నుండి ఢీ కొట్టింది.

ఆ ప్రమాద దృశ్యం చూసిన స్థానికులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. కారు ఆగకుండా కొంత ముందుకు వెళ్లి చెట్టును బలంగా గుద్దుకోవడంతో కారు తీవ్రంగా దెబ్బతింది. పాదచారులలో ఆరుగురికి స్వల్ప గాయాలవ్వగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కారుని స్టేషన్ కు తరలించారు.


Similar News