Tandoor Worker : ఉమ్ముతూ.. తందూరీ రొట్టెల బేకింగ్.. ఇద్దరిపై కేసు!
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో తందూరీ రొట్టెలు తయారు చేసే ఓ వ్యక్తితో పాటు హోటల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో తందూరీ రొట్టెలు తయారు చేసే ఓ వ్యక్తితో పాటు హోటల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రొట్టెలను బేకింగ్ చేసే క్రమంలో వాటిపై సదరు వంటమనిషి ఉమ్మివేస్తున్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్థానిక బజరంగ్ దళ్ కార్యకర్త ఒకరు సహరన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో వంటమనిషితో పాటు హోటల్ నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరిని అదుపులోకి తీసుకొని కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. దర్యాప్తులో గుర్తించే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సహరన్పూర్ ఎస్పీ అభిమన్యు మాంగ్లిక్ వెల్లడించారు.