దారుణం...కొత్తగూడెం ప్రైవేట్​ పాఠశాలలో ఉపాధ్యాయుడి దాష్టీకం

దసరా సెలవుల్లో ఇచ్చిన హోంవర్క్ అసంపూర్ణంగా ఉండడంతో విద్యార్థిపై ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు విచక్షణా రహితంగా దాడి చేసి చితక బాదాడు.

Update: 2024-10-16 09:49 GMT

దిశ, కొత్తగూడెం : దసరా సెలవుల్లో ఇచ్చిన హోంవర్క్ అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థిపై ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు విచక్షణా రహితంగా దాడి చేసి చితక బాదాడు. కొత్తగూడెం పట్టణ పరిధిలోని మానస వికాస్ ప్రైవేట్ పాఠశాలలో గణేష్ టెంపుల్ ఏరియాకి చెందిన పదేళ్ల బాలుడు చేతన్ ఆరవ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకు వెళ్లే సమయంలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు సతీష్ హోం వర్క్ పూర్తి చేయాలని విద్యార్థులకు తెలిపాడు.

    సెలవుల అనంతరం మంగళవారం విద్యార్థులు పాఠశాలకు తిరిగి రాగా చేతన్ హోంవర్క్ అసంపూర్తిగా ఉండటంతో ఉపాధ్యాయుడు సతీష్ కోపంతో విచక్షణా రహితంగా చితకబాదాడు. ఇంటికి వెళ్లిన చేతన్ ఒంటిపై వాతలు చూసిన తల్లిదండ్రులు బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. సీసీ పుటేజీ పరిశీలించి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఉపాధ్యాయుడు సతీష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags:    

Similar News