ఇళ్ల పట్టాల పంపిణీపై కలెక్టర్‌కు ఫిర్యాదు..

Update: 2023-09-25 12:10 GMT

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులో 800 మంది లబ్ధిదారులకు సోమవారం ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. కాగా, పలు వార్డుల్లో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగిందంటూ, కౌన్సిలర్లు తమ చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇల్లు లేని నిరుపేదలకు, ఎన్నో ఏళ్లుగా కిరాయి ఇళ్లలో నివాసం ఉండే వారికి అందాల్సిన స్థలాలు, పక్కా ఇల్లు ఉన్న వారికి, ఒకే ఇంట్లో ఇద్దరికి, ఆర్ధికంగా కలిగిన వారికి పట్టాలు అందాయని ఆరోపిస్తూ దేవరపల్లి భాస్కర్, అన్నబోయిన తిరుపతి సోమవారం కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. 35, 24 వార్డుల్లో అవకతవకలు జరిగాయని, ఆధారాలు చూపుతూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరిపి నిజమైన నిరుపేదలకు న్యాయం చేయాలని కలెక్టర్‌ని కోరినట్లు వారు తెలిపారు.


Similar News