ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని

Update: 2024-10-09 12:11 GMT

దిశ, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను,ఆర్టీసీ బస్సు ఢీకొన్నగా ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆటో పూర్తిగా డామేజ్ అయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు జగన్నాధపురం కు చెందిన సంతోష్ మనోహర్లుగా గుర్తించారు. ఘటన స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదం పై దర్యాప్తు చేస్తున్నారు.


Similar News