నారాయణ్పూర్ జిల్లాలో దారుణం.. ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి దారుణ హత్య
ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు దారుణంగా హతమార్చిన ఘటన ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని నారాయణ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
దిశ, భద్రాచలం: ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు దారుణంగా హతమార్చిన ఘటన ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని నారాయణ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓర్చ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుల్దులి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడనే నెపంతోనే మావోయిస్టులు అతడిని మారణాయుధాలతో కొట్టి హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.