తెలంగాణలో బీజేపీని గెలిపించే అస్త్రాలివే.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికలపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం కిషన్ రెడ్డి హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

Update: 2024-02-26 09:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం కిషన్ రెడ్డి హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని జోస్యం చెప్పారు. ఇప్పుడే కాదు.. ఇంకో పదేళ్ల తర్వాత కూడా బీజేపీకి కాంగ్రెస్‌ పోటీ ఇవ్వలేదని విమర్శించారు. 400 పైచిలుకు సీట్లలో సత్తా చాటబోతున్నామని చెప్పారు. తెలంగాణలోనూ మెజార్టీ సీట్లు చేజిక్కించుకోబోతున్నామని అన్నారు. 14 స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు.

కర్ణాటకలో కాంగ్రెస్ 5 గ్యారంటీలు ఫెయిల్ అయ్యాయని ఆరోపించారు. ఈ రోజు కర్ణాటకలో ఎన్నికలు జరిగితే భారీ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌పై ఉన్న కోపంతో కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లుగా కేంద్రంలోని మోదీ నేతృత్వంలో అద్భుత పాలన అందిస్తున్నదని చెప్పారు. దేశ ప్రజలందరినీ ఏకం చేసి కరోనా వంటి విపత్తు నుంచి దేశాన్ని కాపాడిన ఘనత మోడీదని తెలిపారు. మోసం చేసేది, ఉత్తుత్తి మాటలు మాట్లాడేది కాంగ్రెస్ అని ఆరోపించారు. చెప్పింది చేయడం మోడీ నైజమన్నారు. మోడీ హయాంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్పారు. ప్రపంచ దేశాలకు భారత్ గురు స్థానంలో ఉండాలన్నారు. కాంగ్రెస్ పుణ్యమా అని స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇంకా పేదరికం పోలేదని అన్నారు. తొమ్మిదిన్నరేళ్లు ప్రధానిగా, అంతకు ముందు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మోడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పారు.

Tags:    

Similar News