Kerala Express: కేరళ ఎక్స్‌ప్రెస్‌‌కు తప్పిన పెను ప్రమాదం..! ప్రయాణికులంతా సేఫ్

వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను కలవపెడుతూనే ఉన్నాయి.

Update: 2024-08-27 06:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడుతూనే ఉన్నాయి. తాజాగా తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా పరిధిలోని రఘునాథపాలెం మండలం పాపటపల్లి రైల్వే‌స్టేషన్‌ ప్లాట్‌ఫాం సమీపంలో వృద్ధుల కోసం నిర్మించిన చిన్న వంతెనను నిర్మించారు. అయితే, ఆ వంతెన పైనుంచి బైక్‌ మీద వెళ్లేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. ఈ క్రమంలోనే ట్రాక్‌పైకి కేరళ ఎక్స్‌ప్రెస్‌ రావడాన్ని గమనించిన ఆ వ్యక్తి బైక్‌ను అక్కడే వదిలి పరారయ్యాడు. దీంతో సుమారు 90 కి.మీ వేగంతో వెళ్తున్న ట్రైన్ బైక్‌ను కొద్దిదూరం లాక్కెల్లడంతో బైక్ ముక్కలై భాగాలు అన్ని అక్కడక్కడ ట్రాక్‌పై పడిపోయాయి. బైక్‌లో పెట్రోల్ ఉన్నప్పటికీ మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జరిగిన ఘటనపై కేరళ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్‌ డోర్నకల్లు రైల్వే పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్‌‌ను పరిశీలించారు. 


Similar News