మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద

Update: 2024-10-04 11:36 GMT

దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద శుక్రవారం రోజున స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ మహిళా శక్తి క్యాంటీన్లను చేపట్టిరూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని,ప్రభుత్వం అందిస్తున్న రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్,ఎంపిడివో స్వరూప ,నాయకులు ముత్యం శంకర్ , మ్యాకల మల్లేశం, కడ రి మల్లేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Similar News