జగిత్యాల జిల్లాలో విషాదం.. పాముకాటుతో మహిళా రైతు కూలీ మృతి

పాము‌కాటుకు గురై ఓ మహిళా రైతు కూలీ మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-10-04 03:27 GMT

దిశ, కథలాపూర్: పాము‌కాటుకు గురై ఓ మహిళా రైతు కూలీ మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పత్రీ లక్ష్మి(30) అనే మహిళ రైతు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. రోజువారీలాగే గురువారం వ్యవసాయ పనులకు మక్క చేను కోత పనికి వెళ్లింది. ఈ క్రమంలోనే చేను కోస్తుండగా.. లక్ష్మిని పాము కాటు వేసింది. వెంటనే తోటి కూలీలు ఆమెను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. లక్ష్మికి భర్త, కుమారుడు, కూతురు ఉన్నారు. అందరికీ కూలీ పని చేస్తూ.. చేదోడువాదోడుగా ఉండే లక్ష్మి మృతి పట్ల గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబమైన లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


Similar News