వీర్నపల్లి మండలంలో పర్యటించిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి..

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో పలు గ్రామాల్లో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం పర్యటించారు.

Update: 2024-07-08 15:37 GMT

దిశ, వీర్నపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో పలు గ్రామాల్లో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం పర్యటించారు. శాంతినగర్ లో గిరిజనులు పూలు చల్లి, డప్పు చప్పుళ్ళతో గిరిజన సాంప్రదాయ పద్ధతిలో సంజయ్ కు స్వాగతం పలికారు. ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా శాంతినగర్ లో ఎస్టీ కమ్యూనిటీ హాలుకు, వన్ పల్లి లో రెడ్డి సంఘం భవనం నిర్మాణం కోసం గర్జనపల్లిలో మినరల్ వాటర్ ప్లాంట్ బోర్ పనులకు భూమి పూజ చేశారు.

అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి భోజనం చేసి ముచ్చటించారు. కేలోత్ తండావాసులు మంత్రికి రోడ్డు నిర్మాణం కోసం, వన్ పల్లి రైతులు నిజామాబాద్ సరిహద్దుల్లో ఉన్న పోడు భూముల పట్టాల సమస్య గురించి, వీర్నపల్లి వెంకట్రాయిని చెరువులో ముంపునకు గురవుతున్న రైతులకు న్యాయం చేయాలని వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, ప్రదీప్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పిట్ల నాగరాజు, మండల అధ్యక్షుడు గునుగుల దేవేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు బోడ మల్లేశం, మాలోత్ లకపతి, నాయకులు ప్రకాష్, లకావత్ తిరుపతి, రమేష్ , బండారి మహేష్ బానోత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Similar News