వృద్ధురాలి వద్ద నుంచి సెల్ ఫోన్, పర్సు ఎత్తుకెళ్లిన దొంగ.. ఆమె అరవడంతో..

Update: 2024-08-29 02:23 GMT

దిశ, శంకరపట్నంః శంకరపట్నం మండలంలోని కేశవపట్నం బస్టాండులో బుధవారం ఓ వృద్ధురాలి సంచిలో నుండి పర్సు, సెల్ ఫోన్ దొంగలించిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గనుముకుల గ్రామానికి చెందిన యాదమ్మ అనే వృద్ధురాలు బస్టాండులో బస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో తన దగ్గర ఉన్న సంచిని పక్కన పెట్టుకొని కూర్చుంది. దీనిని గమనించిన దొంగ సంచిలో ఉన్న ఫోను, పర్సును తీసుకొని పారిపోతుండగా వృద్ధురాలు కేకలు వేయడంతో పక్కనున్న ప్రయాణికులు దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా సెల్ ఫోన్ ను పర్సును అక్కడ పడివేసి తప్పించుకొని పారిపోయినట్లు ప్రయాణికులు తెలిపారు. కేశవ పట్నం బస్టాండ్లో ప్రయాణికులకు భద్రత లోపించిందని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.


Similar News