ప్రభుత్వ పాఠశాలలో కీచక టీచర్..

మైనర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ టీచర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-10-21 13:22 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : మైనర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ టీచర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న నరేందర్ విద్యార్థినిల ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేస్తూ వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

ఈ విషయాన్ని విద్యార్థినిలు ప్రధానోపాధ్యాయురాలు శారదతో చెప్పడంతో విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం. దాదాపు 20 రోజుల క్రితం ఈ ఘటన జరగగా, మెల్లిమెల్లిగా విషయం బయటకు వస్తుండడంతో జాగ్రత్త పడ్డ హెచ్ఎం ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి, నిందితుని పై ఫోక్సో కేసు నమోదు చేశారు. కాగా నిందితుడు నరేందర్ పరారీలో ఉన్నాడు.


Similar News