ఫేక్ ఐడీతో లోన్.. ఖంగు తిన్న రైతు..

క్రాప్ లోన్ తీసుకుందామని వెళ్లిన ఓ రైతుకు బ్యాంక్ అధికారులు షాకిచ్చారు.

Update: 2024-10-21 12:49 GMT

దిశ, జగిత్యాల టౌన్ : క్రాప్ లోన్ తీసుకుందామని వెళ్లిన ఓ రైతుకు బ్యాంక్ అధికారులు షాకిచ్చారు. ఆ రైతు పేరు పై ఇదివరకే 20 లక్షల లోన్ ఉందని చెప్పడంతో రైతు కంగుతిన్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకోగా న్యాయం చేయాలంటూ బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. బుగ్గారం మండలంలోని మద్దునూరు గ్రామానికి చెందిన ముంజాల నారాయణ పేరు పై ఫేక్ ఐడీతో మరొకరు లోన్ తీసుకున్నారు. ఆధార్ లో ఫోటో మార్చి ఫేక్ ఐడీతో లోన్ తీసుకున్నట్లుగా బాధితుడు ఆరోపించాడు. న్యాయం చేయాలంటూ ప్రజావాణి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపగా ఈ ఫేక్ ఐడిలోన్ వ్యవహారంలో ఒక్కరే బాధితులా లేక మరికొందరు ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.


Similar News