MEO : ప్రధానోపాధ్యాయుడిని బదిలీ చేసిన ఎంఈఓ..

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడి పై ఎంఈఓ భీమయ్య బదిలీ వేటు వేశారు.

Update: 2024-07-26 17:19 GMT

దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడి పై ఎంఈఓ భీమయ్య బదిలీ వేటు వేశారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అనేకసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు చేపట్టలేదు.

ఈ విషయం తెలుసుకుని దిశ దినపత్రికలో గురువారం రోజున "ఈ సార్ మాకొద్దు" అనే శీర్షికను ప్రచురితం చేసింది. దీనిపై స్పందించిన ఎంఈఓ భీమయ్య ఆ ఉపాధ్యాయుడిని బదిలీ చేశారు. ఆ ఉపాధ్యాయుడు పై అనేకసార్లు ఫిర్యాదు చేసిన చర్య లేని తీసుకోకుండానే బదిలీ చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు దిశ దినపత్రికకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:    

Similar News