తృటిలో తప్పిన పెను ప్రమాదం.. అదుపు తప్పి లోయలో దూసుకుపోయిన కారు..

రామడుగు మండల కేంద్రంలోని నూతన వంతెన పై వెళ్తున్న కారు అదుపు తప్పింది.

Update: 2024-10-26 04:54 GMT

దిశ, రామడుగు : రామడుగు మండల కేంద్రంలోని నూతన వంతెన పై వెళ్తున్న కారు అదుపు ( Car accident ) తప్పింది. గ్రామస్తులు బాధితులు అందించిన వివరాల ప్రకారం కరీంనగర్ ( Karimnagar ) నుండి రామడుగు వైపు టీఎస్ 01 ఈ ఆర్ 6114 అనే ఎర్టిగా కారు నూతన బ్రిడ్జి వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. కాగా అందులో నలుగురు ప్రయాణికులు ఆదిలాబాద్ ( Adilabad) జిల్లాకు చెందిన వ్యక్తులుగా సమాచారం. వంతెన మూలమలుపు వద్ద ప్రమాద ఘంటిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో పురాతన బ్రిడ్జి పైకి నేరుగా వెళ్లే పరిస్థితి నెలకొంది.


Similar News