బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి : ఎస్పీ అశోక్ కుమార్

బాధితులకు సత్వరగా న్యాయం జరిగేలా చూడాలని

Update: 2024-09-23 16:05 GMT

దిశ, జగిత్యాల టౌన్ : బాధితులకు సత్వరగా న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులు ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది ఆర్జీలను స్వీకరించడం తో పాటు ఆర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువయ్యే విధంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని, అలాగే ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడి వినతులను స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేసేలా చూస్తామని తెలిపారు.


Similar News