భగీరథ నీళ్లు రావడం లేదని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని

Update: 2024-09-23 10:57 GMT

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం రోజున ఎంపీడీవో కార్యాలయాన్ని డబుల్ బెడ్ రూమ్ నిర్వాసితులు ముట్టడించారు.ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా రెండు గంటల పాటు ధర్నా కొనసాగించారు.

అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందించి, వారు మాట్లాడుతూ, అధికారులకు చెబితే ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. లేదంటే మిషన్ భగీరథ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ట్యాంకర్ ద్వారా నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. లేనియెడల కలెక్టరేట్ ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్, మోబిన్ బేగం, ఇలియ బేగం, అఖిల, వెంకటి, తదితరులు పాల్గొన్నారు.


Similar News