మృత్యువులోనూ వీడని రక్తసంబంధం..

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరు గ్రామానికి

Update: 2024-09-22 15:02 GMT

దిశ, వెల్గటూర్ : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన చెందిన రెడ్డి మల్ల నరసయ్య (75) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. సర్జరీ అనంతరం అతని ఆరోగ్యం మరింత క్షీణించి 35 రోజులు మృత్యువుతో పోరాటం చేసి శుక్రవారం రోజున ఇంట్లో మరణించాడు. తమ్ముడు నర్సయ్య మరణవార్త విన్న అన్న రెడ్డి మల్ల వెంకటయ్య నాకన్నా ముందే మమ్మల్ని వదిలి పోయావా తమ్ముడు అంటూ తమ్ముడు శవం వద్ద రోధించిచారు.

అన్న అంత్యక్రియలు పూర్తి చేసి కుటుంబ సభ్యులందరూ ఇంటికి చేరారు. అయిన తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేక అన్న నిరంతరాయంగా రోదిస్తూనే ఉన్నాడు. శుక్రవారం రాత్రి నుండి నా తమ్ముడు నన్ను కూడా రమ్మంటున్నాడు. నేను తమ్ముడి దగ్గరకు వెళ్తాను అని, తమ్ముడు లేని చోట నేను ఉండలేను అంటూ కుటుంబ సభ్యులుకు చెప్పుకుంటూ రోదించాడు. ఇదే క్రమంలో శనివారం రాత్రి తీవ్రమైన మనోవేదనకు గురై శ్వాస సరిగా ఆడక ప్రాణాలు విడిచాడు. తమ్ముడు మరణించి 24 గంటలు గడవక ముందే అన్న కూడ చనిపోవడం గ్రామంలో సంచలనం రేపింది. ఒక్క రోజు వ్యవధి లోనే రెడ్డి మల్ల కుటుంబ సభ్యులు ఇద్దరినీ కోల్పోవడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Similar News