Rajasthan : ప్రార్థనా స్థలంలో ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం
దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్లోని అల్వార్ జిల్లా రాజ్ఘర్ పట్టణంలో దారుణం జరిగింది.
దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్లోని అల్వార్ జిల్లా రాజ్ఘర్ పట్టణంలో దారుణం జరిగింది. ఓ మత ప్రబోధకుడు (22) ఏకంగా ప్రార్థనా స్థలంలోనే ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రార్థనా స్థలం సమీపంలోని ఇంటి వద్ద బాలిక ఆడుకుంటుండగా ఆ మత ప్రబోధకుడు ఆమెను పిలిచాడు. అనంతరం ప్రార్థనా స్థలంలోకి బాలికను తీసుకెళ్లి బలాత్కారానికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.