వివాహిత అనుమానస్పద మృతి..

కరీంనగర్ జిల్లా మానకొండూరు లోని ఓ వ్యవసాయ బావిలో

Update: 2024-09-23 16:12 GMT

దిశ,మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు లోని ఓ వ్యవసాయ బావిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మానకొండూర్ గ్రామానికి చెందిన కోండ్ర ప్రహర్ష (24) అనే మహిళ సోమవారం ఇంటి నుండి బహిర్భూమికని వెళ్లి ఇంటి సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో శవమై తేలింది. బొమ్మకల్ గ్రామానికి చెందిన ప్రహర్షను మానకొండూర్ కు చెందిన కోండ్ర కళ్యాణ్ 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన అనంతరం కళ్యాణ్-ప్రహర్ష దంపతులకు కూతురు ఆద్య శ్రీ, కుమారుడు ఆయాన్ జన్మించారు. కళ్యాణ్ గత పది నెలల క్రితం మరణించాడు. ప్రహర్ష ఉపాధి నిమిత్తం కరీంనగర్లోని ఓ షోరూంలో పని చేస్తుంది. సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ప్రహర్ష వ్యవసాయ బావిలో అనుమానాస్పదంగా శవమై తేలినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలి సోదరి నిర్మట్ల ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్ పోలీసులు తెలిపారు.


Similar News