భార్య తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య

గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో వాళ్దాస్ మహేష్ గౌడ్ ( 36 ) ఆదివారం రోజు సాయంత్రం తన భార్యను మద్యం తాగడానికి డబ్బులు అడిగాడు.

Update: 2024-09-23 16:09 GMT

దిశ, గోపాల్ పేట: గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో వాళ్దాస్ మహేష్ గౌడ్ ( 36 ) ఆదివారం రోజు సాయంత్రం తన భార్యను మద్యం తాగడానికి డబ్బులు అడిగాడు. లేవు అని చెప్పడంతో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆరు గంటల సమయంలో చెరువులో దూకి మరణించాడు. సమచారం అందుకున్న భార్య నాగలక్ష్మి, గ్రామస్తుల సహకారంతో వెతకగా సోమవారం మధ్యాహ్నం సమయంలో మృతుని శవం లభ్యమైంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని గోపాల్పేట ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.


Similar News