అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు లారీల పట్టివేత..

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు లారీలతో పాటు ఇద్దరిని ఎల్ ఎండి పోలీసులు సోమవారం సాయంత్రం పట్టుకొని కేసు నమోదు చేశారు.

Update: 2024-07-08 17:06 GMT

దిశ, తిమ్మాపూర్ : అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు లారీలతో పాటు ఇద్దరిని ఎల్ ఎండి పోలీసులు సోమవారం సాయంత్రం పట్టుకొని కేసు నమోదు చేశారు. వివరాలు పోలీసుల కథనం మేరకు పెద్దపెల్లి జిల్లా దేవునిపల్లికి చెందిన గురువయ్య రేషన్ కార్డు లబ్ధిదారుల వద్ధ నుండి పీడీఎస్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి రెండు లారీల్లో నరసింహులపేట గ్రామ శివారులో డంప్ చేసి సిద్దిపేటకు తరలిస్తుండగా పోలీసులు రేణికుంట టోల్ ప్లజా వద్ద పట్టుకున్నారు.

రెండు లారీల్లో 452.30 క్వింటాళ్ళ బియ్యం ఉండగా వాటి విలువ రూ.11,30,750 ఉంటుందని అంచనా వేశారు. ఈ విషయాన్ని పోలీసులు సంబంధిత సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి పరిశీలించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బియ్యంను, వాహనాలు, లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పట్టుకున్న పీడీఎస్ బియ్యాన్ని కరీంనగర్ ఎంఎల్ఎస్ గోడౌన్ కి తరలించినట్లు సివిల్ సప్లై డిటి వేణుగోపాల్, ఇన్స్పెక్టర్ పెట్టం శ్రీనివాస్ తెలిపారు.


Similar News