రామగుండం ఎమ్మెల్యే స్థానికులకు కీలక సూచన

గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా గోదావరిఖనిలో

Update: 2024-09-07 09:43 GMT

దిశ, గోదావరిఖని : గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా గోదావరిఖనిలో భక్తిశ్రద్ధలతో మండపాలలో కొలువుదీరిన గణపతి. శనివారం నాడు గణపతులను మండపాలలో కొలువు తీరడానికి వివిధ రూపాల్లో ఉన్న గణపతులను తమ మండపాలకు ఆటపాటలతో, ఘనంగా వారి మండపాలకు తీసుకుపోయి ప్రత్యేక పూజలు చేసి గణపతిని కొలువుదీర్చారు. అలాగే స్థానిక రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ శాంతియుత వాతావరణంలో వినాయకుని పండుగ జరుపుకోవాలని వినాయకుని మండపాలను లైటింగ్ పూలతో అందంగా అమర్చాలని పిలుపునిచ్చారు. రామగుండం కమిషనర్ ఎం. శ్రీనివాస్ వినాయక మండపంలో వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని,డీజేలు, మద్యం సేవించడం లాంటివి, చేయకూడదని భక్తులకు పిలుపునిచ్చారు.


Similar News