Jagityal SP : జిల్లావ్యాప్తంగా 580 మంది పోలీసులతో బందోబస్తు.

గణేష్ నిమజ్జోత్సవానికి భద్రత ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జగిత్యాల

Update: 2024-09-16 14:53 GMT

దిశ,జగిత్యాల టౌన్ : గణేష్ నిమజ్జోత్సవానికి భద్రత ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. నిమజ్జనానికి సంబంధించి భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలను గురించి పోలీసు అధికారులు, సిబ్బందికి వివరించారు. ఈ మేరకు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 580 మంది పోలీసు అధికారులు, సిబ్బందిచే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని ప్రశాంత నిమజ్జనానికి ప్రజలు సహకరించాలని కోరారు.

పోలీస్ అధికారులు,సిబ్బంది బందోబస్తు కేటాయించిన ప్రాంతం పై పూర్తి అవగాహన చేయవలసిన డ్యూటీ గురించి పూర్తిగా తెలిసి ఉండాలని అన్నారు. డ్యూటీ ప్రదేశం నుంచి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్ళకూడదు అని డ్యూటీ పరంగా లేదా ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు రఘు చందర్, రవీంద్ర కుమార్, రంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, వేణుగోపాల్, రామ్ నర్సింహారెడ్డి, రవి, కృష్ణారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వేణు, ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News